దోమ్మేటి వెంకటరెడ్డి కి నివాళులు అర్పించిన…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా, తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు సోమవారం శెట్టిబలిజ జాతి పితామహుడు, సామాజిక సేవకుడు దొమ్మేటి వెంకటరెడ్డిది నేడు జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్,ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. జిల్లా ఏస్పీ మాట్లాడుతు…., దొమ్మేటి వెంకటరెడ్డి సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన సేవలు, విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. దొమ్మేటి వెంకటరెడ్డి సమాజం అభ్యున్నతికి విశేషంగా కృషి చేసి, విద్య, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి,మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), శ్రీనివాస రావు (సాయుధ దళం), ఎస్బీ డీఎస్పీ వెంకటనారాయణ, చంద్రశేఖర్ (సాయుదళం డియస్పి)ఏవో సురేష్ కుమార్ మరియు డీపీవో అధికారులు. సిబ్బంది పాల్గొన్నారు.



