రీ సర్వే సందర్భంగా వీఆర్వోల సమస్యలను పరిష్కరించండి తహసిల్దార్ కి వినతి పత్రాన్ని అందించిన వీఆర్వోలు

పులివెందుల అర్బన్, ఫిబ్రవరి 19:
రీ సర్వే ను పురస్కరించుకొని వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పులివెందుల తహసిల్దార్ నజీర్ అహ్మద్ కి మండలంలోని విఆర్వోలు, వీఆర్ఏలు మరియు సర్వేర్లు వినితి పత్రం సమర్పించారు.రీ సర్వే నందు గ్రౌండ్ ట్రూత్ యింగ్ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు ఉదయం 9 గంటల కంటే ముందుగా ఫీల్డ్ కు వెళ్లవలసి ఉండగా వీఆర్వోలకు ఎస్ జి డబ్ల్యూ ఎస్ అటెండెన్స్ యాప్ నందు ముందుగా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవడానికి అవకాశం లేనందున రీసర్వే దృష్ట్యా గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర గ్రామాలలో రి సర్వే పనులకు ఆదేశించి ఉన్నందున గ్రామ సర్వేయర్ల మాదిరి రి సర్వే అటెండెన్స్ నందు అధర్ ఆప్షన్ ఉన్నట్టుగా వీఆర్వోలకు మినహాయింపు ఇవ్వవలసినదిగా గ్రామ రెవెన్యూ అధికారులు గ్రేడ్ 2 మరియు గ్రామ సర్వేలకు లైన్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా జీతం ఇచ్చే లాగున తాసిల్దార్ ని డిడిఓ గా,మరియు స్వర్ణ గ్రామ క్లస్టర్ల కేటాయింపులో వీఆర్వోలకు సర్వేయర్ లకు మినహాయింపు ఇవ్వవలసిందిగా వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్వోలు రామాంజనేయులు,నాగ సుబ్బరాయుడు, ఆంజనేయులు మరియు వీఆర్ఏలు పాల్గొన్నారు గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.



