Andhra Pradesh
ఉగాది కానుకగా దివ్యాంగులు సంక్షేమానికి మరో మైలురాయిగా “దివ్యాంగ శక్తి” పథకం

ఉగాది కానుకగా దివ్యాంగులు సంక్షేమానికి మరో మైలురాయిగా “దివ్యాంగ శక్తి” పథకం
*”దివ్యాంగ శక్తి” పథకం ద్వారా ఆర్థిక, సామాజిక పరమైన సహాయాన్ని దివ్యాంగులకు అందించడమే ప్రధాన ఉద్దేశం*.
*దెందులూరు మండలం సత్యనారాయణపురం నుండి ఏలూరు ఏపిఎస్ ఆర్టీసీ డిపో వరకు సాధారణ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి* …
పల్లె వాణి న్యూస్ ఏలూరు/దెందులూరు: మార్చి 18: దెందులూరు మండలం సత్యనారాయణపురంలో బుధవారం “దివ్యాంగ శక్తి” దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు. దెందులూరు మండలం సత్యనారాయణపురం నుండి ఏలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో వరకు సాధారణ ఆర్టీసీ బస్సులో దివ్యాంగులుతో ప్రయాణం చేశారు.



