అంగరంగ వైభోవంగా శ్రీ సౌమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం.

కడపజిల్లా: నందలూరులో వెలసిన పురాతన మహా పుణ్యక్షేత్రం అయినా శ్రీ సౌమ్యనాధ దేవస్థానం, ఈ నెల 21 వ తేది నుండి 31తేది వరకు జరుగుతున్న శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా నేడు మంగళవారం టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి శ్రీ సౌమ్యనాధ స్వామి కళ్యాణం జరిగింది.
స్వామి వారి కల్యాణనికి ఉమ్మడి కడప జిల్లా నలుమూలల నుండి భక్తులు పాల్గొని స్వామి వారి కళ్యాణం అనంతరం తీర్తప్రసాదలు స్వీకరించారు.
కల్యాణనికి వచ్చిన భక్తులకు టీటీడీ దేవస్థానం వారు త్రాగు నీళ్లు, మజ్జిగ, అన్నప్రసదాల సౌకర్యం కల్పించారు.
సౌమ్యనాధ దేవస్థాననికి లైటింగ్ మరియు పూలతో అలంకరణ లు చేసేరు.
స్వామి వారికి 11 రోజులు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి, రథం పై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
కడప జిల్లా ఏస్పీ. నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు.
స్వామి వారి కల్యాణనికి…. “యన్ డి ఏ” కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.



