Andhra Pradesh
నేటి నుండి నూతన జిల్లా ఏస్పీ కార్యాలయంలోనే “ప్రజా వేదిక”…. జిల్లా ఏస్పీ

మదనపల్లి జిల్లా, మదనపల్లి : జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ ధీరాజ్ కునుబిల్లి, ఐపీస్, నేడు ఆదివారం పత్రిక ప్రకటనలో ప్రజల కు తెలుపుతు…. సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పిజిఆర్ఎస్) కార్యక్రమం మదనపల్లిలోని నూతన జిల్లా పోలీసు కార్యాలయంలోనే నిర్వహిస్తామని,
పిర్యాదు దారులు నేరుగా విన్నవించుకునేందుకు వీలుగా, ఆధునిక వసతులతో కూడిన ఈ నూతన కార్యాలయంలోనే ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందన్నారు. స్వయంగా జిల్లా ఏస్పీ బాధితులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేస్తారని, కావున ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి నూతన కార్యాలయానికి రావాలని కోరుతున్నమన్నారు.



