Andhra PradeshEducationPolitical

సాయి బాలాజీ పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా ముక్కా వరలక్ష్మమ్మ.

రైల్వే కోడూరు,  ఫిబ్రవరి 19.

రైల్వే కోడూరు పట్టణ సమీపంలోని కొత్త కోడూరు కామిశెట్టి నగర్‌లోని శ్రీ సాయి బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రిన్సిపాల్ పోకల బాబు, కరస్పాండెంట్ ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్, కుడా అధ్యక్షులు ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మమ్మ, తనయుడు ముక్కా విశాల్ రెడ్డి హాజరయ్యారు. వారు రిబ్బన్ కత్తిరించి నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మమ్మ మాట్లాడుతూ విద్యార్థులు సౌకర్యవంతమైన, ఆధునిక వాతావరణంలో చదువుకుంటే మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు. శ్రీ సాయి బాలాజీ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, సమకాలీన విద్యను అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. పిల్లలు ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించే విధంగా పాఠశాల నిర్వహణ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.నూతన భవనంలో విశాలమైన తరగతి గదులు,సక్రమమైన గాలి–వెలుతురు సదుపాయాలు, శుద్ధమైన తాగునీరు, పరిశుభ్రమైన వసతులు ఏర్పాటు చేయబడినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రావడం ఆనందకరమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జయప్రకాశ్, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button