Telangana
మహబూబాబాద్ టౌన్ సిఐగా రఘుపతి రెడ్డి బాధ్యతల స్వీకరణ.

పల్లె వాణి మహబూబాబాద్ మే16: మహబూబాబాద్ టౌన్ సిఐగా ఎల్ రఘుపతి రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. గతంలో మహబూబాబాద్ టౌన్ సిఐగా పనిచేస్తున్న గట్ల మహేందర్ రెడ్డి కి డిఎస్పీగా పదోన్నతి రావడంతో, మహబూబాబాద్ రూరల్ సిఐ గా పని చేస్తున్న అంజలి టౌన్ సిఐ ఇన్చార్జిగా పనిచేశారు. ఈ సందర్భంగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సిఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతగా విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సి ఐ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.



