Telangana

13న మహబూబాబాద్ లో జాబ్ మేళా: టి.రజిత.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మే 11:మారుతీ ఆగ్రోటేక్ ఫెర్టిలైజర్ టెక్నాలజీ, మహబూబాబాద్ సంస్థ జిల్లా పరిధిలో మార్కెటింగ్ సేల్స్ ఎక్షిక్క్యుటివ్ గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించుటకు, 13 న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, మహబూబాబాద్ లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి. రజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.పనిచేయుటకు అనుభవం అవసరం లేదని టూ వీలర్ కలిగి ఉండవలెనని మరియు తమ స్వంత మండలాలలో పని చేసే అవకాశం కలదని తెలిపారు.
పదవ తరగతి ఆ పైన చదివి 21-35వయసు గల వారికి అవకాశం కల్పించబడుతుందని.కావున అర్హత ఆసక్తి కల్గిన అభ్యర్థులు 13న జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం, రూమ్ నెం. 25, రెండవ అంతస్తు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కురవి రోడ్, మహబూబాబాద్ లో జరుగు జాబ్ మేళా కు విద్యార్హత సర్టిఫికేట్లతో వివరాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button