ఘనంగా మహానాడు సంబరాలు

కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ : నందమూరి తారక రామరావు ఆంధ్రప్రదేశ్, కృష్ణ జిల్లా, గుడివాడ తాలుక, నిమ్మకూరు గ్రామం లో వ్యవసాయ కుటుంబనికి చెందిన, నందమూరి లక్షుమయ్య చౌదరి మరియు నందమూరి రామమ్మ దంపతులకు 28 – 5 – 1923 వ సంవత్సరములో జన్మించాడు.ఎన్టీఆర్ విద్యాబ్యాసం అయినా అనంతరం మంగళగిరి లో సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం చేసి అనంతరం సీనిపరిశ్రమలో హీరో గా నటించిన అనంతరం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి, 1983 వ సంవత్సరములో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ స్థాపించాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కష్టలను తీర్చి మరియు నిరుపేదలకు అనేక పథకాలు పెట్టేడు.
ఎన్టీఆర్ జన్మదినం మే 28 వ తేది సందర్బంగా ఎన్టీఆర్ శ్వాస ఉన్నంతవరకు ప్రతి ఒక జన్మదినం రోజు మే నెల 27, 28,29 వ తేది లలో ఘనంగా మహానాడు కార్యక్రమన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు.ఎన్టీఆర్ 18 – 1 – 1996 సంవత్సరములో ఆరోగ్యం బాగాలేక మృతి చెందడంతో, నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ని ముందుకు నడిపిస్తు, మే నెల 27, 28, 29 వ తేది న ఎన్టీఆర్ జయంతి రోజున మహానాడు కార్యక్రమ సంబరాలు ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పసుపు పండుగ లాగ చేసుకుంటున్నారు.



