మదనపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన,, భద్రతా ఏర్పాట్లు… జిల్లా ఏస్పీ,,జిల్లా కలెక్టర్

మదనపల్లి జిల్లా: మదనపల్లి ప్రధాన పోలీస్ కార్యాలయం నుండి నేడు గురువారం పత్రిక ప్రకటన సమాచారం…. శనివారం 18 తేది న్నాడు మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న సందర్బంగా, జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (ఏ స్పీ ) ధీరాజ్ కునుబిల్లి ఐపీస్, మరియు
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఆధ్వర్యంలో నేడు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏ యస్ యల్ ) నిర్వహణ నిర్వహించారు.
ఆలాగే ముఖ్యమంత్రి సెక్యూరిటీ అదనపు ఎస్పీ ఆర్.పి.ఎల్. శాంతికుమార్, డీఎస్పీ కె. శివ పోతురాజు, ఐఎస్ డబ్ల్యూ అధికారులతో కలిసి హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణాలను సమీక్షించించారు.
అనంతరం ట్రాఫిక్, పార్కింగ్, భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా పోలీస్, రెవెన్యూ మరియు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో….. జేసి, శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.



