Telangana
బయ్యారం మండల నూతన ఎస్సైగా ప్రశాంత్ బాబు బాధ్యతల స్వీకరణ.

పల్లె వాణి బయ్యారం: బయ్యారం మండల నూతన ఎస్సై గా ప్రశాంత్ బాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ పనిచేస్తూ బయ్యారం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు.ఇక్కడ ఎస్సై గా పనిచేస్తున్న తిరుపతి వీఆర్కు బదిలీ అయ్యారు.నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ బాబు మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని,శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ ఇసుక,మట్టి తొలకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు.



